నూతన సంవత్సరం వస్తుందంటే చాలు అంబరాలు సంబరాన్నంటుతాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు వస్తూ ఉంటాయి. అన్ని రంగాల్లో ఆపర్ల పై ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటారు. కర్ణాటక రాజధాని బెంగళూరు మేయర్ గంగాంబిక మాత్రం న్యూ ఇయర్కు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
2019 న్యూ ఇయర్ రోజున అంటే జనవరి ఒకటిన జన్మించే 24 మంది ఆడపిల్లలకు రూ.5లక్షలు బంపర్ ఆఫర్ ప్రకటించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) తరఫున ఈ మొత్తాన్ని అందిస్తామని వెల్లడించారు. ఇందుకోసం గతేడాదే ‘పింక్ బేబీ’ పేరుతో పథకాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు.
ఈ ఏడాది కూడా పింక్ బేబి పథకాన్ని కొనసాగిస్తామని మేయర్ స్పష్టం చేశారు. బీబీఎంపీ పరిధిలోని పాలికె 24 ఆసుపత్రిల్లో ఏడాది మొదటిరోజు పుట్టిన 24 మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందజేస్తామని ఆ సొమ్మును వారికి ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు.ఒకవేళ జనవరి 1న కాకుండా రెండో తేదీన అమ్మాయి పుట్టినా బహుమతిగా రూ.5 లక్షలు అందిస్తామని తెలిపారు.