Thursday, May 9, 2024
- Advertisement -

చదివేది 9 దో తరగతి ప్రియుడికోసం ఎంత పనిచేసిందంటే…?

- Advertisement -

తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా 9 దో తరగతి చదువుతున్న బాలిక ప్రియుడిని వదిలి వుండలేక ప్రియుడితో కలసి తండ్రినె హతమార్చింది . మగ పిల్లాడితో స్నేహం ఏంటని వారించడమే ఆ తండ్రి చేసిన పాపమైంది.పకడ్బందీగా కుట్ర పన్ని తండ్రిని చంపేసిన ఆ అమ్మాయిని చూసి పోలీసులే విస్తుపోతున్నారు. ఈ సంఘటన బెంగులూరులో చోటు చేసుకుంది.

కర్ణాటక రాజధాని బెంగళూరులోని రాజాజీనగర్ ఐదో బ్లాక్‌లో ఓ వ్యక్తి భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి నివాసముంటున్నాడు. అతడి కుమార్తె(15) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె తన ఇంటికి సమీపంలోనే ఉంటూ బీకామ్ చదువుకుంటున్న ప్రవీణ్‌ అనే యువకుడితో చనువుగా ఉండేది. క్రమంగా వారిద్దరి మధ్య చనువు పెరగడంతో ఆ యువకుడు తరుచూ బాలికి ఇంటికి వచ్చేవాడు. దీనికి తోడు బాలిక చదువడం మానేసి గంటల పాటు అతడితో ఫోన్లో మాట్లాడేది.ప్రవీణ్ పదేపదే తమ ఇంటికి రావడాన్ని చూసిన ఆమె తండ్రి వారించాడు.

దీంతో తండ్రిపై బాలిక కోపం పెంచుకుంది. ఎలాగైనా తండ్రిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలసి ప్లాన్ వేసింది. గత ఆదివారం నాడు తన తల్లి, తమ్ముడు పాండిచ్చేరికి వెల్లారు. ఇదే అదునుగా చూసుకొని నిద్రమాత్రలు కలిపిన పాలు తండ్రికి ఇచ్చింది. దీంతో తండ్రి నిద్రలోకి జారుకున్నాక ప్రియుడిని పిలిచి అతడి సాయంతో తండ్రి గొంతు కోసి మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో పడేశారు. ప్రవీణ్‌ బయటి నుంచి పెట్రోల్ తెచ్చి మృతదేహంపై పోసి నిప్పటించాడు. కాస్త పెట్రోల్ పడటంతో వారికి కూడా మంటలు అంటుకోవడంతో పెద్దగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కలవారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటల్ని ఆర్పి, గాయపడ్డ ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు.

ఘటనాస్థలిని పరిశీలంచిన పోలీసులు బాలికను ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో అసలు నిజాలు ఒప్పుకున్నారు.దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసును మరింత లోతుగా విచారిస్తున్నామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -