కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ నియేజక వర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్టటి వరకు టికెట్ ఎవరికనేదానికి స్ఓప స్పష్టత లేకపోయినా నియేజక వర్గంలో తమ పట్టు నిలుపు కొనేందుకు భూమా,శిల్పా వర్గాలు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. టికెట్టు మాకుటంబానికే కేటాయించాలని అఖిల ప్రియ డిమాండ్ చేస్తుండటంతో …భూమా గాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి నియేజక వర్గంలో పర్యటిస్తున్నారు.
కర్నూల్ జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాత్మరనంలో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.అయితే ఈ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై టిడిపి నాయకత్వం తలలుపట్టుకొంటోంది. శిల్పా మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కూడ పోటీకి సై అంటున్నారు. అయితే ఈ రెండు కుటుంబాలతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చర్చలు జరుపుతున్నారు.అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే పార్టీకి నష్టంవాటిల్లకుండా టీడీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.
{loadmodule mod_custom,Side Ad 1}
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టుకోసం భూమా బ్రహ్మనందరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. భూమా కుటుంబానికి టిక్కెట్టును కేటాయించాల్సి వస్తే భూమా బ్రహ్మనందరెడ్డిని ఆ కుటుంబం నుండి బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు.నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు భూమా అనుచరులు ఎవరూ కూడ అధైర్యపడాల్సిన అవసరం లదనే భరోసా ఇస్తున్నారు.భూమాలేని లోటును తీర్చేందుకు శాయశక్తులా కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.తన కుటుంబం మొదటి నుండి రాజకీయాలతో సంబంధం ఉన్నందున అన్ని విషయాలపై తనకు అవగాహాన ఉందన్నారు బ్రహ్మనందరెడ్డి
నంద్యాల ఎమ్మెల్యేగా ఉంటూ భూమా నాగిరెడ్డి మరణంతో రాజకీయాలు మారిపోయాయి.తల్లి మరణంతో ఆమె అనివార్యంగా రాజకీయాల్లోకి వచ్చారు.తండ్రి అనుభవాలతో ఆమె రాజకీయాల్లో పాఠాలు నేర్చుకొంటున్నారు.అదే సమయంలో భూమా నాగిరెడ్డి మరణంతో అఖిలప్రియకు ఇబ్బంది ఏర్పడింది.ఈ తరుణంలోనే నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీకి బ్రహ్మనందరెడ్డిని బరిలోకి దింపాలని ఆ కుటుంబం భావిస్తోంది.భూమా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా అనుచరులు చెల్లాచెదురుకాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే నంద్యాల నియోజకవర్గంలో తామున్నామనే భరోసాను కల్పించేందుకు భూమా కుటుంబం ప్రయత్నాలను ప్రారంభించింది. టికెట్కోసం శిల్పా కూడా పోటీపడటంతో ఇప్పుడు నియేజక వర్గంలో రాజకీయాలు ప్రతీష్టాత్మకంగా మారాయి.శిల్పా వర్గానికి చెక్ పెట్టడంతోపాటు.భూమా అనుచర గనం చెల్లా చెదురు కాకుండా ఉండేందుకే బ్రహ్మనందరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు.
Related