Friday, May 3, 2024
- Advertisement -

45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.  ఈ ఎండలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరో వైపు వడగాల్పులు కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. జాతీయ రహదారులు బోసిపోతున్నాయి.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కాకినాడ, అనంతపురం, కడప వంటి పట్టణాల్లో పుర వీధులు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు కూడా భానుడి తాపంతో అల్లాడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -