సాధారణంగా పెళ్లి తరువాత వాంతులు చేసుకుంటే వెళ్లి ప్రగెన్సీ పరీక్షలు చేయిస్తుంటారు. కాని ఇక్కడ విచిత్ర సంఘటన జరిగింది. పెళ్లి రోజునే వధువు వాంతులు చేసుకుందని ఆమెకు కన్యత్వ పరీక్షలు చేయించాడు ఓ ఘనుడు.ఈ ఘటన మన పక్క రాష్ట్రం కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… కర్ణాటకకు చెందిన రక్షిత(26)కు మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ద్వారా శరత్(29) పరిచియం ఏర్పడింది. ఎంబీఏ పూర్తి చేసి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేయడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయి.అయితే వీరి పెళ్లి 2018నవంబర్లోనే జరగాల్సి ఉండగా వాయిదా పడుతు వస్తోంది.
దీనికి కారణం కూడా లేకపోలేదు. రక్షితపై శరత్కు అనుమానం మొదలైంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఎట్టకేలకు రక్షితను వివాహం చేసుకున్నాడు శరత్. ఇక్కడే అనుహ్యా ఘటన చోటు చేసుకుంది. తాళికట్టిన కొద్దిసేపటికే తీసుకున్న ఆహారం అరగక రక్షితకు వాంతులు చేసుకుంది రక్షిత. ఇది గమనించిన శరత్ రక్షిత పెళ్లికి ముందే ఎవ్వరితోనో తిరిగి గర్భం దాల్చిందని అనుమానం పెంచుకున్నాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లి కన్యత్వ, ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయించాడు. అవి చేయించిన తర్వాత ఆమెకు అసలు విషయం తెలిసింది.
అవి కేవలం ఆహారం అరగక చేసుకున్న వాంతులే అని డాక్టర్లు తెల్చారు. దీంతో శరత్ను వదిలేసి రక్షిత తన పుట్టింటికి వెళ్లిపోయింది. పెళ్లి జరిగినా కూడా తన భార్య తన ఇంటికి రావడం లేదంటూ శరత్ పోలీసులను ఆశ్రయించాడు. ఇంతలా అనుమానించే వ్యక్తితో కాపురం చేయలేనని తేల్చిచెప్పడంతో వారు విడాకులు తీసుకోవాడనికి సిద్ధమయ్యారు.
- Advertisement -
పెళ్లి రోజు వాంతులు చేసుకుందని వధువుకి కన్యత్వ పరీక్షలు చేయించిన వరుడు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -