కాసేపట్లో ఆమె పెళ్లి అనగా మండపం లోకి ఎక్కడ్నుంచి దూసుకుని వచ్చారో కానీ కొందరు దుండగులు దూసుకుని వచ్చేసి పెళ్లి కూతురుని కిడ్నాప్ చేసారు, మధ్యలో అడ్డు వచ్చిన ఆమె చిన్నాన్న ని పెళ్ళికి వచ్చిన వందల మంది ముందు దారుణంగా హత్య చేసి మరీ ఆమె ని ఎత్తుకుని పోయారు . తమిళ నాడు వేలూరు లో గాంధీ నగర్ లో ఈ సంఘటన జరిగింది. గాంధీనగర్ కి చెందినా ఆరుముగం అనే వ్యక్తి అదే ప్రాంతం లో ఫర్నీచర్ దుకాణం నడుపుతున్నాడు, ఆయన కూతురు లావణ్య తాతగారి ఇంట్లో ఉంటూ బీకాం చదువుతోంది.
కన్నన్ అనే వ్యక్తి తో ఆమె కి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారి ఇద్దరి ప్రేమనీ పెద్దలు ఒప్పుకోకపోవడం తో ఆమె ని దక్కించుకోవడం కోసం అతను ఇంకా ఎక్కువగా వెంటపడేవాడు.
పోలీసులు కేసు పెట్టినా అతను ఆమెని వదలలేదు. ఈ పరిస్థితి లో ఆమెకి పెళ్లి చేస్తే అంత సర్దుకుంటాయి అని సిద్దం అయిన ఆమె ని కూడా కిడ్నాప్ చేసారు గుర్తు తెలియని వారు . అతని స్నేహితులే ఇది చేసారు అని స్థానికులు చెబుతున్నారు. దీన్ని చూసిన లావణ్య చిన్నాన శివకుమార్(35) అడ్డగించి కారులో వెనుక వైపు ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లాక జాతీయ రహదారి రాగానే శివకుమార్ను కారులో నుంచి కిందకు తోశారు. శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.