Friday, May 3, 2024
- Advertisement -

కర్నాటకలో ముగిసిన రాజకీయ సంక్షోభం…బలపరీక్షలో యడ్డీ విజయం

- Advertisement -

కర్నాటకలో గత కొన్ని రోజులుగా జరగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. బలపరీక్షలో యడియూరప్ప విజయం సాధించారు. బలపరీక్షలో బీజేపీకి 106 ఓట్లు లభించాయి. ప్రస్తుతం సభలో సభ్యుల సంఖ్యను బట్టి సాధారణ మెజార్టీ కంటే రెండు ఓట్లు ఎక్కువ రావడంతో యడ్యూరప్ప బలపరీక్షలో గెలుపొందారు. మూజువాణి ఓటు ద్వారా విశ్వాస పరీక్షలో యడ్డీ నెగ్గినట్లు స్పీకర్‌ రమేశ్‌కుమార్ ప్రకటించారు.

రాజీనామాలు చేసిన 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్య 224 కాగా, 17 మందిపై అనర్హత వేటు వేయడంతో 207 కు చేరింది. బల పరీక్షలో నెగ్గేందుకు మేజిక్‌ ఫిగర్‌ 104 కాగా, బీజేపీకి సొంతంగా 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో యడ్డీ విజయం లాంఛనమైంది.విశ్వాస పరీక్ష ముగియడంతో స్పీకర్ రమేశ్ కుమార్ రాజీనామా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -