జియే పుణ్యామని టెలికంరంగంలో తీవ్ర పోటీ నెలకొనడంతో టెలికం కంపెనీలన్ని కష్టమర్లకోసం భారీ అఫర్లు ప్రకటించడం సాదారన మయ్యింది.రోజు ఏదో ఒక టెలకంకంపెని కొత్త ఆపర్లను ప్రకటిస్తోంది.
ఈ పోటీ నేపథ్యంలో చౌక డేటా రేట్లతో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ప్రీపెయిడ్ యూజర్లకు కొత్త 3జీ మొబైల్ డేటా ఆఫర్ ను ప్రకటించింది.
{loadmodule mod_custom,GA1}
బీఎస్ఎన్ఎల్ కొత్తగా చౌక-444పేరుతో ఈ ప్రమోషనల్ ప్రీపెయిడ్ ప్యాక్ ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.444 రీఛార్జ్ తో రోజుకు 4జీబీ డేటాను 90 రోజుల పాటు ఇవ్వనుంది. అంతకముందు ప్రకటించిన ఎస్టీవీ 333 అకా ఏస్ ప్లాన్ కు మంచి స్పందన రావడంతో తాజాగా ఈ ఎస్టీవీ-444 ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది.
అన్ని సెగ్మెంట్లలోని తమ కస్టమర్లకు సరసమైన, సమర్థవంతమైన సర్వీసులు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ ఆర్కే మిట్టల్ తెలిపారు. ప్రస్తుత టెలికాం మార్కెట్లో ట్రెండ్ కు అనుగుణంగా తమ కస్టమర్లకు మంచి ధరలను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
{loadmodule mod_custom,GA2}
Also read