తెలంగాణాలో ఎన్నికల ప్రచారం పోరు మరింత ఉధ్రుతం కానుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీలు ప్రచారం నిర్వహించారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణా ఎన్ఇకల నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీంతో అన్ని జిల్లాల్లో అధికారులు నోటిఫికేషన్ గెజిట్ను విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం విడదుల చేసి షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసు కోవచ్చు.
ఇవాళ్టీ నుంచి ఈ నెల 19 వరకు ప్రతీ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారని. 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరకు గడువు విధించింది. డిసెంబర్ 7న పోలింగ్, డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. కొంతమంది నేతలు… మంచిరోజు, ముహుర్తాలు చూసుకుంటున్నారు.
