Wednesday, April 17, 2024
- Advertisement -

సింగరేణి ఛైర్మన్ కొనసాగింపుపై కేంద్రం అభ్యంతరం..!

- Advertisement -

సింగరేణి 99వ వార్షిక సమావేశం కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో జరిగింది. ఏడాదికి ఒకసారి నిర్వహించే ఈ సమావేశంలో సాధారణంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, డివిడెంట్ చెల్లింపు, డైరెక్టర్ల జీత భత్యాలకు ఆమోదం తదితర అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుతుంటారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమావేశంలో ఆడిట్​లో క్లీన్ చిట్ సాధించిన వార్షిక అకౌంట్లను ఆమోదించింది.

ఈ సమావేశంలో సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కొనసాగించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి వ్యతిరేకించారు. సభ్యుల్లో ఒక్కరు మాత్రమే వ్యతిరేకించడం, మిగిలిన ఐదుగురూ అనుకూలంగా ఓటు వేయడంతో అసమ్మతి వీగిపోయింది. ఫలితంగా ఛైర్మన్ శ్రీధర్ యథాతథంగా కొనసాగుతారని సింగరేణి ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -