Friday, May 17, 2024
- Advertisement -

సోము నోటికి బాబు తాళం, కాపు కార్డు పనిచేయలేదు !

- Advertisement -

ఆ మధ్య ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మీద విపరీతంగా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసి సోము వీర్రాజు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కొన్నిరోజులకు ముందు వరకు ప్రతిరోజూ చంద్రబాబునాయుడు సర్కారును దుమ్మెత్తిపోయడం అనేది తనకు ఒక ఉద్యోగం అన్న రీతిలో చెలరేగిపోయిన సోము వీర్రాజు హఠాత్తుగా ఇంత సైలెంట్ అయ్యారేమిటి?  దీని వెనకాల చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్ ఉంది అని చెబుతున్నారు. 

సోము వీర్రాజు భాజాపా రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి మీద ఆశలు  పెట్టుకుని ఇలా రెచ్చిపోయారు అని అంటున్నారు. దీంతో చంద్రబాబు స్వయంగా ఆయన సంగతి తేల్చడం కోసం ఆ సీటు ఆయనకీ దక్కకుండా చక్రం అడ్డం వేసారు అని అంటున్నారు. సోము లాంటి నోటు దూకుడు ఉన్న వ్యక్తి ఆ పార్టీ కి రాష్ట్రం లో సారధి అయితే రెండు పార్టీలకి మధ్యన సంబంధాలు దెబ్బతింటాయి అనే ఉద్దేశ్యం తో డిల్లీ పెద్దల నుంచి నరుక్కుంటూ వచ్చి ఆయన ని సైలెంట్ చేసారు.  సోము ఏ “కాపు” కార్డుని ఉపయోగించుకుని భాజపా పీఠం ఎక్కాలి అని చూసారూ ఆ కార్డు కూడా  బీజేపీ కి ఉపయోగపడకుండా బాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

సోము గతంలో కాపులకి క్యాబినెట్ లో చోటు లేదు అని విమర్శించారు దానికి తగ్గట్టు సమాధానం చెబుతూ కాపులను బీసీల్లోచేర్చడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం గురించి కాపు కార్పొరేషన్ కు వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించడం గురించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సోము వీర్రాజు నోటికి కూడా చంద్రబాబు తాళం వేశారని అనుకోవాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -