Friday, April 26, 2024
- Advertisement -

క్రిస్మస్ పర్వదినం.. సడలింపుల సమయం..!

- Advertisement -

క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో బ్రిటన్​లో లాక్​డౌన్ ఆంక్షలను సడలించనున్నారు. డిసెంబర్ 23 నుంచి 27 మధ్య ప్రజలు.. కలిసి పండగ జరుపుకోవచ్చని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఒక కుటుంబం మరో రెండు కుటుంబాలతో కలిసి ‘క్రిస్మస్ బబుల్’ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. బ్రిటన్​లోని నాలుగు దేశాలు ఇందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.

ఈ నిర్ణయం వల్ల మూడు కుటుంబాలు కలిసి పండగ నిర్వహించుకునేందుకు యూకేలోని నాలుగు దేశాల్లో(ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్) ఏ దేశానికైనా ప్రయాణాలు చేసుకొనే అవకాశం లభించనుంది. చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలు దర్శించుకునే వీలు ఉంటుంది. నాలుగు రోజుల పాటు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.

అయితే క్రిస్మస్ జరుపుకొనే సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బోరిస్ అభ్యర్థించారు. ఇది సాధారణ క్రిస్మస్ కాదని.. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వెసులుబాటును జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -