- Advertisement -
న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసినందుకుగాను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు రూ.15,000 జరిమానా విధించింది. ఓ కేసులో 500లకు పైగా రోజుల ఆలస్యం తర్వాత అప్పీలు దాఖలు చేసినందుకు గాను ఈ రుసుం చెల్లించాలని ఆదేశించింది.
కేసు విషయంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఓ వ్యక్తి ఉద్యోగాన్ని క్రమబద్దీకరించాలని సూచిస్తూ.. 2018లో అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును సుప్రీం కోర్టు తాజాగా విచారించింది. అయితే.. అప్పీలును ఆలస్యం చేసినందుకు సంబంధిత అధికారులకు ఈ జరిమానా విధించింది.