Friday, May 3, 2024
- Advertisement -

విషాదంలో ఆ గ్రామం.. సెప్టిక్‌లో పడి ఐదుగురు దుర్మరణం!

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేబాద్‌ తహసీల్‌ పరిధిలోని ఓ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆట ఆడుకుంటూ ఓ బాలుడు సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడు. ఆ బాబు ని రక్షించేందుకు  మరో నలుగురు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు సహా ఐదుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకున్నది. ప్రతాప్‌పురా గ్రామంలో అనురాగ్‌ అనే (10) అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సెప్టిక్‌ ట్యాంక్‌లో పడిపోయాడు.

ఇది గమనించి ఆ బాలుడిని రక్షించేందుకు ముగ్గురు హరి మోహన్ (16), అవినాష్ (12) సోను (25)తో సహా నలుగురు ట్యాంక్‌లోకి దిగారు. ఒకేసారి అక్కడ భయంకరమైన వాసన రావడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అక్కడే ఉన్న యోగేశ్‌ అనే వ్యక్తి సైతం వీరిని రక్షించే ప్రయత్నం చేయగా.. అతను సైతం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 

వెంటనే గ్రామస్థులు వారిని ఆసుపత్రికి తరలించారు.. అప్పటికే అనురాగ్ చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతుల్లో హరిమోహన్​, అవినాష్​, అనురాగ్ సోదరులు. ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతులు ఒక్కొక్కరికి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కింగ్ నాగార్జున!

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు లెక్కింపు ప్రారంభం…!

అనుమానాస్పద స్థితిలో ఎంపీ మృతి.. పోస్ట్​మార్టం రిపోర్ట్ తరువాత నిజాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -