ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో సారి తన పెద్ద మనసును చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంతో జగన్ ఎప్పుడూ ముందుంటాడు. గతంలో కేన్సర్తో బాధపడుతున్న విద్యార్థికి సహాయం చేసిన జగన్ మరోసారి ఆపన్న హస్తం అందించారు.గుంటూరు జిల్లా 10 టివి సీనియర్ రిపోర్టర్ గా పనిచేసే గుంటుపల్లి రామకృష్ణకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ పండ్ నుంచి విడుదల చేశారు.
లివర్కు సంబంధించి వ్యాధితో బాదపడుఉతున్న రామకృష్ణకు సాధారణ చికిత్సకు వ్యాధి తగ్గకపోవడంతో ..లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తప్పని సరని వైద్యులు నిర్దారించారు. హైదరాబాద్ లోని గ్లోబల్ హాస్పెటల్ లో రామకృష్ణకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది.ఇందుకు పెద్ద మొత్తంలో ఖర్చు కావడంతో 10 టివి యాజమాన్యం 3 లక్షలరూపాయలు తక్షణ వైధ్య ఖర్చులకు అందజేసింది. ముఖ్య మంత్రి సహాయ నిధికి రామకృష్ణ తరుపున దరఖాస్తు చేసింది. సానుకూలంగా స్పందించిన జగన్ 10 లక్షల రూపాయలను విడుదల చేశారు. 10 లక్షల రూపాయల చెక్కును సోమవారం హైదరాబాద్ లో ఉన్న రామకృష్ణకు 10 టివి ఇన్ పుట్ ఎడిటర్ చుక్కా రవి అందజేశారు. దీంతో రామకృష్ణ 10 టీవీ యాజమాన్యానికి, సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. కష్టం వస్తే ఆదుకోవడంలో జగన్ ముందుంటారనడంలో సందేహంలేదు.