Sunday, May 5, 2024
- Advertisement -

గ‌జ‌గ‌జ‌లాడుతున్న అగ్ర‌రాజ్యం

- Advertisement -

అమెరికాలో  పరిస్థితులు దారుణంగా దిగజారాయి. చలి తీవ్రతకు అగ్ర‌రాజ్యం గడ్డకట్టిపోతుంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మైనస్ 50 వరకు చేరుకోవడంతో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.  అమెరికా రాజధాని వాషింగ్టన్‌, విస్కాన్సిన్, ఇలినాయిస్, మిచిగాన్‌ తదితర ప్రాంతాల్లో ‘మంచు ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. అంతేకాదు ఎక్కువ సేపు మాట్లాడ‌వ‌ద్ద‌ని.. గ‌ట్టిగా ఊపిరి తీసుకోవ‌ద్ద‌ని అధికారులు ప్ర‌జ‌ల‌కు సూచించారు.  దీంతో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావడం లేదు. అధికారులు కూడా పాఠశాలలు కొన్ని కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. 

సెకన్లలోనే ఒళ్లు మొద్దుబారేలా చేసే చలివాతావరణం ఆవరించి ఉందని.. అలాగే ఇటువంటి చలి వాతావరణంలో బయట 10 నిముషాలకు మించి ఉంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. రానున్న రెండుమూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని అధికారులు సూచించారు.

చలి తీవ్రతకు పశ్చిమ అమెరికా మధ్య భూభాగం ఎక్కువగా ప్రభావితమైంది. మైనస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడంతో మంచు వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ దాదాపు మంచు వర్షంతో నిండిపోయాయి. డకోట ఉత్తర మిన్నెసోటాలలో -45 డిగ్రీలు నమోదవుతోంది. ఇక షికాగో మొత్తం మంచు ముద్దలా మారింది. దీంతో ఏ ఒక్క విమాన సర్వీసులు ప్రారంభం కావడం లేదు. 2300 విమానాలు రద్దయినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రభావం అటు బ్రిటన్ పై పడింది. దేశంలోని పలు చోట్ల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మాంచెస్టర్ లివర్ ఫూల్ వంటి విమానాశ్రయాల్లో విమానాలు అక్కడే నిలిచాయి. ఇక్కడ మైనస్ 10 డిగ్రీలు నమోదు కావడంతో రోడ్లన్నీ మంచుతో కప్పబడ్డాయి. దీంతో అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -