Monday, May 13, 2024
- Advertisement -

రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు

- Advertisement -

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను ఖాతాలో వేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయం సాధించారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ హవా హోరాహోరీగా కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగగా.. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా మొదటి రౌండ్ లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ 38 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 725 ఓట్లకు 692 ఓట్లు పోలయ్యాయి. ఖమ్మంలో 347 ఓట్లు సాధించిన అభ్యర్థిదే విజయం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -