Saturday, May 18, 2024
- Advertisement -

డీకే అరుణ దగ్గర అంత డబ్బు ఉందా..?!

- Advertisement -

కాంగ్రెస్ జమానాలో మంత్రిగా చేసిన డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి భారీ జరిమానా పడింది.

అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు ఏకంగా 33 కోట్ల రూపాయల జరిమానా విధించింది.మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని క్వారీల్లో అరుణకుటుంబం చేస్తున్న మైనింగ్ లో అక్రమాలున్నాయని హై కోర్టుకు ఫిర్యాదు అందాయి.
గతంలో అరుణ మంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని ఉపయోగించుకొని ఆమె  మ్యానేజ్ చేసిందని.. ప్రభుత్వ అధికారులు కూడా ధ్రువీకరించారు. ఈ మైనింగ్ లీజులు అరుణ భర్త భరత సింహారెడ్డి, అరుణ కూతురుల పేర్ల మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని రోజుల కిందటే ఈ అక్రమాల గురించి ధ్రువీకరణ జరిగింది. ఇప్పుడు భారీ జరిమానా పడింది.
విశేషం ఏమిటంటే.. ఈ జరిమానాను కచ్చితంగా వసూలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ జరిమానాను మీరు వసూలు చేస్తారా.. మమ్మల్ని చేయమంటారా.. అని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించడం విశేషం. మరి 33 కోట్లరూపాయల జరిమానా అంటే.. ఇది చాలా భారీ మొత్తమే అని చెప్పాలి. మరి అరుణ దగ్గర అంత డబ్బులు ఉన్నాయోలేదో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -