ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. బుధవారం నాడు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు కోర్టు పచ్చ జండా ఊపినట్టు సమాచారం.
8వ తేదీన యధావిధిగా ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుందని తేలిపోయింది. ఈ నేపథ్యంలో 8వ తేదీ ప్రతి ఒక్కరు తమ ఓటును ఉపయోగించుకోవాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.
ఇక ఎన్నికలు సజావుగా జరిగేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు.
కరోనా పై సమీక్ష.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..!