స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడంతో స్వలింగ సంపర్కులు తమ జీవిత భాగస్వాములను ఎంచుకోవడం ఎక్కువవుతోంది. తాజాగా ఉత్తర ప్రదేశ్లో ఇద్దరు స్వలింగ సంపర్కులు పెళ్లిచేసుకున్న ఘటన సంచలనం రేపుతోంది. అయితే వాళ్లిద్దరు అక్కా చెళ్లెల్లు కావడం గమనర్హం.
సంస్కృతి, సంప్రదాయలకు పుట్టినిల్లుగా పేరొందిన వారణాసి వంటి ఆధ్యాత్మిక నగరంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇటువంటి వివాహం జరగటం వారణాసి చరిత్రలో మొదటిదని పలువులు సంప్రదాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెల్తే…కాన్పూర్కు చెందిన ఓ యువతి తనకు చెళ్లి వరుస అయ్యే మరో యువతిని.. స్థానిక శివాలయానికి తీసుకవెళ్లారు. ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో.. ఎరుపు రంగు చున్నీని ముఖానికి ధరించి వెళ్లారు. తమకు పెళ్లి జరిపించాలని పూజారిని కోరారు. అయితే పెళ్లి చేయడానికి పూజారి నిరాకరించడంతో వారె పెళ్లి చేసుకొని సోషల్ మీడియాలో పోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటపై వారణాసిలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.