Friday, May 17, 2024
- Advertisement -

మోడీని నడి రోడ్డులో అలా చేసినా తప్పు లేదు : నారాయణ

- Advertisement -
CPI leader narayana serious comments on modi..

నోట్ల రద్దు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీని పలువురు విమర్శిస్తున్నారు. అయితే వాటిలో కొన్ని విమర్శలు కాస్త ఘటుగా ఉంటున్నాయి.

తాజాగా సీపిఐ లీడర్ నారాయణ మోడీని ఉద్దేశించి ఘటుగా వ్యాఖ్యానించారు. మోడీని నడిరోడ్డుపై కటినంగా శిక్షించినా తప్పులేదని అన్నారు. సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. రిజర్వ్ బ్యాంక్ వద్ద ధర్నా చేస్తున్న సందర్భంగా మాట్లాడిన నారాయణ కరెన్సీ నోటుకు రిజర్వ్ బ్యాంక్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా హామీదారుగా ఉంటారని అన్నారు.

అలాంటిది నోట్ల రద్దు ప్రకటనతో దేశంలో గందరగోళం సృష్టించారని ఆయన విమర్శించారు. ప్రజలపై ప్రమేతో మోడీ ఈ నిర్ణయం తీసుకోలేదని ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎలక్షన్‌లో గెలిచేందుకే ఇలా చేశారని విమర్శించారు నారాయణ. నోటుకు విలువ లేకుండా చేశారని, ప్రస్తుత పరిస్థితికి మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఐ నేత నారాయణ అన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -