Tuesday, May 7, 2024
- Advertisement -

త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం…ఒకే కుటుంబానికి చెందిన 7 గురు మృతి

- Advertisement -

త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ఈ ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది.మృతి చెందిన వారిని మహారాష్ట్రకు చెందిన రైల్వే పోలీసులు అధికారి మెల్విన్‌ దేశ్‌ముఖ్‌ కుటుంబ సభ్యులుగా గుర్తించారు.

మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. త‌మిళ‌నాడుకు విహార‌యాత్ర‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -