Monday, May 6, 2024
- Advertisement -

ఢిల్లీలో దారుణం…జ‌డ్జికుటుంబంపై గ‌న్‌మెన్ విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు

- Advertisement -

ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ గన్‌మ్యాన్ రెచ్చిపోయాడు. పట్టపగలు..నడిరోడ్డుపై..అందరూ చూస్తుండగా..బీభత్సం సృష్టించాడు. అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి క్రిష్ట కాంత్ కుటుంబ సభ్యులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. జడ్జి భార్య, కుమారుడిపై తూటాల వర్షం కురిపించాడు. తీవ్ర గాయాలతో వారిద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రద్దీగా ఉన్న మర్కెట్‌లో కాల్పులకు తెగబడిన గన్‌మెన్.. అనంతరం జడ్జి కుమారుడిని తనతో పాటే తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కుడున్న వారు అడ్డుకోవడంతో గన్‌తో సహా కారులో పారిపోయాడు. పోలీసులు అతన్ని వెంబడించి ఫరీదాబాద్ రోడ్డు సమీపంలో పట్టుకున్నారు. అతని మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు వెల్లడించారు.

నిందితుడు గత కొంత కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, ఈ క్రమంలో కాల్పులు జరిపి ఉంటాడని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనను తేలికగా తీసుకోవడం లేదని, నిందితుడిని అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -