Thursday, May 2, 2024
- Advertisement -

వెంకయ్య ఫ్యామిలీకి తెలంగాణ సర్కారు లబ్ధి చేకూర్చిందా!

- Advertisement -

పోలీసులకు ఇన్నోవాలు ఎందుకు? పోలిస్ డ్యూటీకి అవి తగిన వాహనాలు కావు.. అని అప్పట్లోనే చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసుల కోసం ఆ వాహనాలు  కొనుగోలు చేయడాన్ని చాలా మంది తప్పుపట్టారు.

అయితే తామేం చేసినా గొప్పగా ఉండాలనే కేసీఆర్ సర్కారు ఆ విమర్శలను లెక్క చేయలేదు. పోలీసులకు ఆ వాహనాలనే కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ విషయంలో ఒక మీడియా సంస్థ ప్రచారం చేసిన ప్రత్యేక కథనం సంచలనంగా మారింది!

తెలంగాణ సర్కారు కొందరి లబ్ధి కోసమే ఆ వాహనాలను కొనిందని.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కుమారుడికి మేలు చేకూర్చేలా తెలంగాణ పోలీసులకు వాహనాలను కొనుగోలు చేసిందని ఒక ఆంగ్ల వార్తా చానల్ అభిప్రాయపడింది. ఈ మేరకు కథనాన్ని ప్రసారం చేయించింది. దీనిపై విమర్శలు చెలరేగడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. వాహనాల కొనుగోలులో ఎలాంటి అవినీతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

ఈ విషయంలో తాము ఆ చానల్ పై పరువునష్టం దావాను వేయడానికి కూడా సిద్ధం అని వారు ప్రకటించారు. మరి ఈ వ్యవహారం ఎంత వరకూ వెళుతుందో కానీ.. ఆంధ్రప్రాంతానికి చెందిన వెంకయ్య ఫ్యామిలీ కి తెలంగాణ సర్కారు ఇలాంటి మేలు చేసిందనే ఆరోపణలు రావడం మాత్రం ఆసక్తికరం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -