Wednesday, May 22, 2024
- Advertisement -

ఈ ఇండియన్ ఎంత ఎదవ పని చేశాడో తెలుసా…

- Advertisement -

ధన వ్యామోహం ఉండటం తప్పు కాదు గాని.. ఎంతోమంది ప్రాణాలను తీసేలా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. ఆ వ్యామోహం తోనే ఇప్పుడతడు అడ్డంగా బుక్ అయిపోయాడు. పైగా అతగాడికి లెక్కలేనంత ఆస్థి ఉంది .పైగా బిలియనీర్ .అయినా…అతని కకృత్తి పోనిచ్చుకోలేదు. కోట్లు సంపాదించాలన్న దురాశ అతడి చేత దుర్మార్గానికి పాల్పడేలా చేసింది. ఇదంతా భారతీయ అమెరికన్ ఫార్మా బిలియనీర్ జాన్ నాథ్ కపూర్ గురించి చెబుతోన్న మాటలు. ఎఫ్ బీఐ అధికారులు ఇతన్ని అమెరికాలో అరెస్ట్ చేశారు. 74 ఏళ్ల ఈ బిలియనీర్ ఎంతటి దుర్మార్గపు పని చేశాడో తెలుసా.

ఇతడు క్యాన్సర్ రోగులు నొప్పి నివారణకు వాడే ఓపియడ్ ను…. మీ రోగులకు ఎడ్వైజ్ చేయాలని డాక్టర్లకు భారీ ఎత్తున ముడుపులు ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు. అమెరికాలో ఇలా చేయడం పెద్ద నేరం. ఈ ప్రమాదకరమైన డ్రగ్ బారిన పడి.. దాన్ని ఓవర్ డోస్ తీసుకోవటం వల్ల 20వేల మంది ఈ డ్రగ్ కు అలవాటు పడ్డారు. వారిలో పలువురు మరణించటంపై అమెరికన్ అధికారులు కోపోద్రిక్తులై పోయారు.

అమృత్ సర్ లో పుట్టిన కపూర్… 1960లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లిపోయాడు. అక్కడ ఓ ఫార్మా కంపెనీకి డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతగాడి కంపెనీ తయారు చేసిన డ్రగ్ కు ఇప్పటి వరకు ఎన్నో వేల మంది బానిస అయ్యారని… తెలుస్తుంది. అయితే దీనికి కారణమైన వ్యాపారుల నుంచి కంపెనీ ఎగ్జిక్యూటివ్ ల వరకూ ఎవరినీ వదిలిపెట్టేది లేదని అమెరికా పోలీసు ఉన్నతాదికారులు చెబుతున్నారు. ఇతనిపై ఆరోపణలు నిరూపితమైతే భారీ శిక్ష ఖాయమని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -