తెలంగాణలో దుబ్బాకలో ఎన్నికల రిజల్ట్ భటే టెన్షన్ పుట్టిస్తుంది. టీఆర్ఎస్, బీజేపి మద్య జోరుగా పోటీ కొనసాగుతుంది. 5 రౌండ్లు ముగిసేసరికి దుబ్బాక లో బిజేపికు 3,020 ఓట్ల ఆధిక్యం.వరుసగా 5 రౌండ్లలో బిజేపికు ఆధిక్యం.ఐదో రౌండ్లో బిజేపి కు 336 ఓట్ల ఆధిక్యం.5 రౌండ్లు ముగిసేసరికి బిజేపి-16,517, తెరాస-13,497, కాంగ్రెస్-2,724 ఓట్లు .
తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. 23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరికాసేపట్లో స్పష్టం కానుంది. కొవిడ్-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్ నమోదైంది.
చంద్రబాబు వేషాలు తమిళ మీడియా సాక్షిగా తెలిసింది..?
చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?