జగన్ సీఎం అయిన దగ్గరినుంచి చంద్రబాబు వైఖరి ప్రజలకు ఏమాత్రం రుచించట్లేదు.. జగన్ తో కలిసి ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు ముందుకు రాలేదు కదా కనీసం మద్దతు కూడా తెలపలేదు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పక్ష నేతలు సైతం తనను పొగడాలి అనుకునే చంద్రబాబు ఇప్పుడు దాన్ని మరిచి జగన్ ని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారు..పోయిన ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత జగన్ స్పోర్టివ్ గా తీసుకుని కొన్ని విషయాల్లో చంద్రబాబు కు సహకరించారు.. కానీ చంద్రబాబు ఇన్ని ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కూడా తన కన్నా చిన్నవాడైన జగన్ ని ఒరవకుండా ఉండడం ఎవరికీ నచ్చడం లేదు..
మంచి చేదు చెప్పేది పోయి ఇలా పగ పట్టినట్లు ప్రవర్తించడం చంద్రబాబు అసూయా ని తెలియజేస్తుందని అంటున్నారు.. సొంత పార్టీ నేతలు సైతం జగన్ పై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.. ఇక ఈ విషయం పొరుగు రాష్ట్రాలకి చేరింది.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న తీరు పక్క రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశం అవుతోంది. అభివృద్ధి వైపు దూసుకెళ్తూ ఏపీలో నూతన శకం ప్రారంభమవుతున్న వేళ.. అది రుచించని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, సంక్షేమ పథకాలకు అడ్డుతగులుతున్నతీరును అందరూ గమనిస్తున్నారనడానికి ఇదో నిదర్శనం.
ఇటీవలే ఓ తమిళ పత్రిక ‘ఏన్ ఇంద వయిట్రెరిచ్చల్’ (ఎందుకీ కడుపు మంట) పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది. గడిచిన ఎన్నికల సమయంలో నీవు తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలతో నష్టపోయాం, రాజకీయ చాతుర్యంతో ముందుకు సాగిపోతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నీ కెందుకీ కడుపుమంట’ అని టీడీపీ శ్రేణులే చంద్రబాబు తీరుపై వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఆ కథనం సారాంశం. దీంతో చంద్రబాబు ఇమేజ్ ఇంత దిగజారిపోయేలా ఎందుకు చేసుకుంటున్నారు అంటున్నారు.. మరి చంద్రబాబు దీనిపై ఏమని స్పందిస్తారో చూడాలి..
చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?
జంపింగ్ జపాంగ్లను పక్కన పెట్టిన బాబు..!