Wednesday, May 8, 2024
- Advertisement -

ఎపిలో శ్రీకాకుళం.. విశాఖలో స్వల్ప భూకంపం

- Advertisement -

భూకంపం దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. భారత్ తో పాటు మయన్మాన్ లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 7.1 ఇది నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్ కతా, చెన్నై, గౌహతి నగరాల్లో భూమి కంపించింది.

ఢిల్లీలో మెట్రో రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విశాఖపట్నంలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా భూమి కంపించినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇళ్లలో ఉన్న సామాన్లు వాటికవే పడిపోవడంతో తీవ్ర భయానికి గురయ్యామని, ఇంతకు ముందు విశాఖపట్నంలో వచ్చిన ఉదూద్ మళ్లీ వచ్చిందా అని భయం వేసిందని విశాఖ వాసులు చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -