- Advertisement -
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ముందస్తు ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉందని ఈసీ కమిటీ నివేదించింది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్కు ఉమేష్ సిన్హా కమిటీ నివేదిక సమర్పించింది.
ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయిందిఈ నివేదికలో ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలతో పాటు తెలంగాణాలో ఎన్నికలను నిర్వహించవచ్చని తెలిపింది.ఉమేష్ సిన్హా కమిటీ నివేదికపై చర్చించిన మకిటీ తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ దాదాపు నిర్ణయించింది.
వారం, పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించనుంది. అనంతరం ఎన్నికల తేదీలపై తుది కసరత్తు చేయనుంది. అక్టోబర్ రెండో వారంలో 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.