- Advertisement -
పారిస్ నుంచి ఈజిప్టు బయలుదేరి గగనతలంలో కనిపించకుండా పోయిన విమానం శకలాలను మధ్యధరా సముద్రంలో గుర్తించినట్లు ఈజిప్టు ఆర్మి ప్రకటించింది. ఉగ్రవాదుల దాడి కారణంగా అది కూలి ఉంటుందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో పది మంది సిబ్బందితో పాటు 56 మంది ప్రయాణీకులు కూడా ఉన్నారు. విమాన శకలాలతో పాటు ప్రయాణీకులకు చెందిన వస్తువులు కూడా సముద్రంపై తేలుతున్నట్లుగా నేవీ అధికారులు చెబుతున్నారు. అలెగ్జాండ్రియాకు ఉత్తరాన 290 కిలోమీటర్ల దూరంలో వీటిని గుర్తించారు. అక్కడ నేవి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
