Saturday, May 4, 2024
- Advertisement -

చ‌త్తీస్‌గ‌డ్‌లో ఎన్‌కౌంట‌ర్…ముగ్గురు మావోయిస్టులు హ‌తం

- Advertisement -

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం మ‌రో సారి కాల్పుల‌తో అట్టుడికి పోయింది. మ‌రో సారి పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గింది. ఈ సంఘ‌ట‌న‌లో మావోల‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఈరోజు బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతాబలగాలు ముగ్గురు మావోయిస్టులను హతమార్చాయి.

జిల్లాలోని మిర్తూర్ అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఈరోజు ఉదయం కూంబింగ్ నిర్వహించాయి. బలగాలు మిర్తూర్ అటవీప్రాంతానికి చేరుకోగానే అప్రమత్తమైన మావోలు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే ప్రతిస్పందించిన భద్రతాబలగాలు మావోలపై ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, మిగతావారు అక్కడి నుంచి పరారయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -