Friday, May 3, 2024
- Advertisement -

సంజయ్​ రౌత్​ సతీమణికి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ సమన్లు జారీ ..!

- Advertisement -

శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ భార్య వర్షా రౌత్​కు ఎన్​ఫోర్స్​ మెంట్​ డైరక్టరేట్​ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. పంజాబ్​, మహారాష్ట్ర కోపరేటివ్​ (పీఎం​సీ) బ్యాంక్​ కుంభకోణంలో ఆమెను ప్రశ్నించనుంది ఈడీ. ఆమెను డిసెంబర్​ 29న తమ ముందు హాజరు కావాలని ఈ మేరకు సమన్లు జారీ చేశారు అధికారులు.

వర్షా రౌత్​ బ్యాంక్​ ఖాతాలోకి పలు లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ లావాదేవీలు ఎందుకు, ఎలా జరిపారనే విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఈడీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఓ ఆస్తి కొనుగోలు చేసేందుకు ఆమె తీసుకున్న రుణంపైనా అధికారులు ప్రశ్నలు వేయనున్నట్లు తెలుస్తోంది.

వర్షా రౌత్​ కన్నా ముందు ఎన్​సీపీ నేత ఏక్​నాథ్ ఖాడ్సేకు ఓ భూ వివాదంపై ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయను డిసెంబర్​ 30న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. 2016లో ఆయన దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం వల్ల రాజీనామా చేశారు. బిజేపి లో 40 ఏళ్లుపాటు ఉన్న ఏక్​నాథ్​ ఇటీవల ఎన్​సీపీలో చేరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -