- Advertisement -
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి అయ్యాడు. CMR ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సాయినాథ్ అనే విద్యార్థి ప్లీజ్స్టాప్ ర్యాగింగ్ అని సూ సైడ్ నోట్ రాసి మరి చనిపోయాడు.
వరంగల్ జిల్లా వడ్డేపల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయినాథ్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల మండలం రామక్రిష్ణాపురం. కళాశాలలో ర్యాగింగ్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సూ సైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది.
కానీ ఎవరు ర్యాగింగ్ చేశారో అతను రాసిన లేఖలో పేర్కొనలేదు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు ఎన్ని చర్యలు తీసుకున్నా మళ్ళీ రిపీట్ అవ్వటం అందర్నీ బాధిస్తోంది. ప్లీజ్ స్టాప్ సూసైడ్స్..!