కరోనా రెండోదశలో ప్రజలకు చుక్కలు చూపించింది. మొదటి దశలో కేవలం వృద్ధులకే సోకిన మహమ్మారి రెండో దశలో యువత, మధ్యవయస్కుల వారి మీద ప్రభావం చూపించింది. రెండో దశలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు ఆక్సిజన్ దొరకక.. బెడ్లు ఖాళీలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే కరోనాకు ఇప్పటి వరకు కచ్చితమై ఔషధం అందుబాటులో లేదు. ఐవర్మెక్టిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఫాబీఫ్లూ వంటి మందులు పనిచేస్తున్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు.
అయితే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీరియస్ అయినవాళ్లకు రెమిడెసివర్ ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే ఈ ఇంజెక్షన్లు ఎంతవరకు పనిచేశాయో తెలియదు కానీ.. వాటి ద్వారా బ్లాక్ఫంగస్ అనే కొత్త రోగం వచ్చింది. ఐవర్మెక్టిన్ , రెమిడెసివిర్ వాడొద్దంటూ డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. దీంతో కరోనాకు కచ్చితమైన చికిత్స లేకుండా పోయింది. తక్కువ లక్షణాలు ఉన్నవాళ్లకు ఈ వ్యాధి నయం అవుతున్నది. కానీ పరిస్థితి విషమించిన వాళ్లకు మాత్రం రోగం నయం కావడం లేదు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ వైద్యులు కాక్టెయిల్ మందు బాగా పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారిన పడగా ఈ మందు ఆయన చికిత్సకు ఆ విషయం తెలిసిందే. ఈ యాంటీ బాడి కాక్టెయిల్ను తీసుకున్న 40 మంది రోగుల్లో కోవిడ్ లక్షణాలు తగ్గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. 24 గంటల్లోనే ఈ మందు ఫలితాలు ఇస్తున్నట్టు తెలిపారు.
40 మంది రోగులకు మోనో క్లోనల్ యాంటీ బాడీలున్న సింగిల్ డోస్ కాక్టెయిల్ ఇచ్చామని డాక్టర్లు చెప్పారు. 24 గంటల్లో వారికి పరీక్షలు చేయగా.. కరోనా నెగిటివ్ వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. కరోనా పేరుతో చాలా కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం దోపిడీకి తెరలేపాయి. కరోనా కు మందు లేదంటూనే లక్షల్లో ఫీజు వసూలు చేయడం ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
Also Read
థర్డ్వేవ్.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్ఫుల్..!
విశ్వాసం అంటే ఇదే..! యజమాని కోసం అంబులెన్స్ వెంట కుక్క పరుగు..!