Saturday, May 4, 2024
- Advertisement -

అంతా రహస్యం.. మోసం చేస్తోన్న బ్యాంక్ బాబులు

- Advertisement -
Everything is secret.. bank employees are deceiving

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనాన్ని మార్చుకునే పనిలో పెద్ద దందానే నడుస్తోంది. బ్లాక్ మనీని మార్చుకోలేక ఇబ్బంది పడుతున్న బడా బాబులకు సహాయం చేస్తూ బ్రోకర్లు రంగంలోకి దిగుతున్నారు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన అంశంమేమంటే..

బ్యాంకు మేనజర్లు, సిబ్బందే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా ఈ పని జరుగుతున్నట్టు సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం భారీగానే ఉంది.

 

వ్యవహారం మొత్తం రహస్యంగా చక్కబెడుతున్నారు. ఈ దందాలో బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునే క్రమంలో 50 నుంచి 70 శాతం కమీషన్ తీసుకునే విధంగా డీల్ మాట్లాడుకుంటున్నారు. కంచే చేను మేస్తే కాపేమీ చేయగలడు. అలా ఉంది బ్యాంకు ఉద్యోగుల పని. మేనేజర్‌తో పాటు, ఉద్యోగులు సైతం అప్పనంగా వచ్చే కాసులకు కక్కుర్తి పడుతున్నారు. డిసెంబర్ 30 దాటితే ఎందుకూ పనికిరాని కాగితాలుగా మారిపోనుండటంతో బ్యాంకు మేనేజర్లకు కోట్ల రూపాయిల్లో ఎర వేస్తున్నారు. లక్షలు, కోట్లలో కమీషన్ తీసుకుని యుధేచ్చగా బ్లాక్‌మనీని వైట్‌గా మారుస్తున్నారు. నల్లధనాన్ని తెల్లగా మర్చుకోవాలని చూస్తోన్న వారు ఎక్కడ దొరుకుతారా అని జల్లెడ పడుతున్నారు బ్రోకర్లు. ఈ మొత్తం తతంగం గురించి ఆర్బీఐకి కూడా సమాచారం అందడంతో బ్యాంకులపై నిఘా పెట్టింది. కొందరు బ్యాంక్ మేనేజర్లపై వేటు వేసి తగిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్దమౌతున్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -