మాజీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్సీ ప్రతిభా భారతి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. విశాఖలోని పినాకిని ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సకోశ సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్య (92)ను చూసేందుకు ప్రతిభా భారతి ఆసుపత్రికి వచ్చారు.
శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్య (92)ను చూసేందుకు ప్రతిభా భారతి ఆసుపత్రికి వచ్చారు. తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసిన ఆమె… తట్టుకోలేక, స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే గుండె పోటు రావడంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది ఐసీయూకు తరలించారు.
ఐసీయూలో ప్రతిభా భారతికి డాక్టర్ల బృందం వైద్యం అందిస్తోంది. ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చిందని.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిభా భారతికి గుండెపోటు వచ్చిందని తెలియగానే.. అనుచరులు, అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.