- Advertisement -
బ్రిటన్లో ఓ మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని శుభ్రం చేస్తుండగా జరిగిన పేలుళ్లలో నలుగురు మృతిచెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బ్రిస్టల్ సమీపంలోని అవాన్మౌత్లో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రంలో కార్మికులు పనిచేస్తుండగా… భారీ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేంద్రంలో ఉన్న రసాయన ట్యాంకు వల్లే పేలుడు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుళ్ల ధాటికి పెద్దఎత్తున మురుగు నీరు చుట్టుపక్కల ఉన్న భవనాలపై పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది… క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.