Wednesday, May 15, 2024
- Advertisement -

రైతులకి.. ఫుట్​ మసాజర్స్..!

- Advertisement -

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో పోరాటం చేస్తోన్న రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పలువురు.. ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సింఘు సరిహద్దులో.. నిరసనలు చేపట్టి అలసిపోయిన రైతులు సేదతీరేందుకు ‘ఫుట్​ మసాజర్స్​’ ఏర్పాటు చేసింది ‘ఖాల్సా ఎయిడ్​-ఇండియా’ అనే ఎన్​జీఓ. 25 మసాజర్స్​ను అందించింది. ముందుగా వయస్సుపైబడిన వారికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది.

రైతుల ఆందోళనలకు మద్దతుగా నిలుస్తోన్న వారికి కృతజ్ఞతలు తెలిపింది ఆ ఎన్​జీఓ. తమ బృందం అన్నదాతలకు సాయంగా నిలుస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొంది.

సుదీర్ఘకాలంగా ఇక్కడే ఉన్న వయస్సు పైబడిన రైతులకు ఈ ఫుట్​ మసాజర్స్​లో సేదతీరేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరసనల్లో ఎక్కువ సమయం ఉండటం వల్ల వారు అలసిపోతున్నారు అమర్​ప్రీత్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -