Sunday, May 19, 2024
- Advertisement -

నాలుగేళ్ల‌ కూతురుకి మ‌ద్యంతాగించి అత్యాచారం చేసిన తండ్రి…ప‌రిస్థితి విషమం

- Advertisement -

మ‌హిళ‌లు, వృద్ధులు, చిన్నారుల‌పై హ‌త్యా, అత్యాచారాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్ర‌తీ రోజు ఎక్క‌డో ఒక చోట ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గుతూనె ఉన్నాయి. ఇద‌లా ఉంటె కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన తండ్రులే అభం శుభం తెలియ‌ని క‌న్న కూతుర్ల‌పై అత్యాచారానికి ఒడిగ‌డుతున్న సంఘ‌ట‌న‌లు చోటు చేసుక‌న్న సంగ‌తి తెలిసిందే. అలాంటి సంఘ‌ట‌నె త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారికి మ‌ద్యం తాగించి క‌న్న తండ్రే అత్యాచారాం చేశాడు. తీవ్ర రక్తస్రావమైన ఆ చిన్నారి ఆసుప‌త్రిలో ప్రాణాలతో పోరాడుతోంది.

వివ‌రాల్లోకి వెల్తే…మెరైన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఐదేళ్లు దుబాయ్‌లో ఉండి గతేడాది చెన్నైకి వచ్చాడు. భార్య, నాలుగేళ్ల కుమార్తెతో చెన్నైలోని విల్లివాక్కం‌లో నివాసముంటున్నాడు. భార్య ఓ బ్యూటీ పార్ల‌ర్‌లో పని చేస్తోంది.మంగళవారం భార్య పనికి వెళ్లిపోగా … ఇంట్లోనె కన్నకూతురిపైనే కన్నేసిన కామాంధుడు. చిన్నారికి మద్యం తాగించాడు. దీంతో అప‌స్మార‌క స్థితిలోకి వెల్లిన చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

చిన్నారి తల్లి సాయంత్రం ఇంటికి వచ్చి గదిలోకి వెళ్లి చూడగా చిన్నారి జననాంగాల వద్ద తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో పడిఉంది. భర్త మంచంపైనే అసభ్యకర స్థితిలో ఉండటాన్ని గుర్తించింది. వెంట‌నే పాప‌ను ఆసుప‌త్రికి తీసుకెల్లి చికిత్స చేయించింది. పాప ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో ఐసీయులో చికిత్స అందిస్తున్నారు డాక్ట‌ర్లు. తన కూతురిపై భర్తే దారుణానికి పాల్పడటాన్ని భరించలేని ఆ తల్లి ఈ ఘటనపై రాజమంగళం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -