Monday, May 6, 2024
- Advertisement -

మొదటి లవ్​ జిహాద్ కేసు తుస్ తుస్..!

- Advertisement -

‘లవ్​ జిహాద్’​ కేసు విషయంలో ఓ యువకుడిపై చర్యలు తీసుకోవద్దని ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులను ఆదేశించింది అలహాబాద్ హైకోర్టు. జిస్టిస్​ పంకజ్​ నఖ్వీ, జస్టిస్ వివేక్ అగర్వాల్​ సభ్యులుగా గల ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చింది.

లవ్​ జిహాద్​కు సంబంధించి ముజఫర్​పుర్​లో తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్​ చేస్తూ నదీమ్​ అనే వ్యక్తి హైకోర్టులో రిట్​ పిటిషన్​ వేశాడు. పిటిషనర్ తరఫున వాదించిన న్యాయవాది ఎస్​ఎఫ్​ఏ నఖ్వీ.. ఆర్డినెన్సు జారీ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్సు కింద నమోదు చేసిన నేరారోపణలు తొలగించాలని కోరారు.

ఈ నేపథ్యంలో.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవొద్దని పోలీసులను ఆదేశించింది. నదీమ్​.. మత మార్పిడికి పాల్పడ్డాడనేందుకు సరైన ఆధారాలు లేవని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -