Friday, April 19, 2024
- Advertisement -

కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు.. పోస్టల్ బ్యాలెట్లలో దుమ్మురేపుతున్న బీజేపీ!

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ట్రెండ్స్ విడుదలవుతున్నాయి. మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఈ ఉదయం మొదలైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ చేస్తున్నారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సుల లెక్కింపు జరుపనున్నారు.

కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు జరిగిన లెక్కింపుల్లో బీజేపీ 87, టీఆర్ఎస్ 29, ఎంఐఎం 17 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది.  ఎంఐఎంకు గట్టి పట్టున్న పాతబస్తీలో సైతం పోస్టల్ బ్యాలెట్ లో పలు చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండటంతో ఫలితాల సరళిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మొత్తంగా గ్రేటర్‌లో 1,926 పోస్టల్ బ్యాలెట్లు పోల్ కాగా.. అందులో దాదాపు 40 శాతం ఓట్లు చెల్లకుండా పోయాయి. మరోవైపు.. ఇప్పటికే తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా… ఫలితాలును వెల్లడించాల్సి ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -