గ్రేటర్ హైదరాబాద్లో పలు అభివృద్ధి పథకాల కోసం చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణ సందర్బంగా ఇచ్చే.. పరిహారానికి బదులుగా జీహెచ్ఎంసీ అభివృద్ధి బదలాయింపు హక్కు( టీడీఆర్- ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్)తో మంచి ఫలితాలు వచ్చాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
టీడీఆర్ కింద ఇప్పటి వరకు రూ.3,095.50 కోట్లు వెచ్చించారని కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ ద్వారా ఇప్పటి వరకు రోడ్ల విస్తరణలో చేపట్టిన ఎస్సార్డీపీ, లింక్ రోడ్ల నిర్మాణం, రహదారుల విస్తరణ, చెరువుల సుందరీకరణ, నాలా విస్తరణలకు మొత్తం 807 టీడీఆర్లు జారీ చేశారు. దీనికోసం రూ.1500 కోట్ల నగదు జీహెచ్ఎంసీకి మిగులుబాటయ్యేలా వెసులుబాటు కలిగిందన్నారు. ఇది మంచి ప్రయత్నమని మంత్రి కేటీఆర్ కొనియాడారు.
చత్తీస్ గఢ్ లో మళ్లీ కాల్పుల మోత.. నక్సలైట్ మృతి..!
హోం క్వారంటైన్లోకి పవన్ కల్యాణ్.. కారణం అదేనా?
తెలంగాణలో మాస్క్ లేకుంటే వెయ్యి కట్టాల్సిందే.. ఉత్తర్వులు జారీ!