- Advertisement -
తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. హెచ్ఆర్ఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నగర శివారు ప్రాంతాలైన శంషాబాద్, జల్పల్లి, శామీర్ పేట ప్రాంతాల ఉద్యోగులకు ఈ మేరకు హెచ్ఆర్ఏ పెరగనుంది.
జీహెచ్ఎంసీకి 8 కిలోమీటర్ల పరిధిలో ఉండటం వల్ల ఈ ప్రాంతాల వారికి 24 శాతం ఇంటి నివాస భత్యం లభించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.