- Advertisement -
2 జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో విషయంలో తాను సత్యాలు మాట్లాడినందుకు తనను మంత్రి పదవి నుంచి తొలగించారని యుపిఎ ప్రభుత్వంపై కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి హన్స్రాజ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో మరోసారి యుపిఎ ప్రభుత్వం పనితీరుపై చర్చకు తెరలేచింది. దీంతో పాటు 2007 సంవత్సరంలో ములాయం సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించిందని, ఆ నిర్ణయాన్ని కూడా తాను తీవ్రంగా వ్యతిరేకించానని భరద్వాజ తెలిపారు.