Wednesday, May 8, 2024
- Advertisement -

ప్రిడేటర్​ డ్రోన్లను చూశారా..!

- Advertisement -

ఓ అమెరికా సంస్థ నుంచి రెండు ప్రిడేటర్​ డ్రోన్లను లీజుకు తీసుకుంది భారత నావికాదళం​. ప్రస్తుతం వీటిని హిందూ మహా సముద్రంలో నిఘా కోసం వినియోగిస్తోంది. అయితే చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రిడేటర్​ డ్రోన్లను తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.


భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో రక్షణశాఖ అత్యవసర కొనుగోళ్లకు అనుమతులివ్వడం వల్ల ఈ డ్రోన్లను తీసుకుంది భారత నావికాదళం.ఈ నెల మొదటి వారంలో ఈ డ్రోన్లు తమకు అందాయని.. ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని నౌకాదళం వెల్లడించింది. 30 గంటల పాటు నిర్విరామంగా ప్రయాణించగలిగే సామర్థ్యం ఈ డ్రోన్ల సొంతమని, ఇది నౌకాదళానికి పెద్ద ఆస్తి అని అధికారులు వెల్లడించారు.

ఈ రెండు డ్రోన్లను ఏడాది పాటు లీజుకు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇలాంటి మరో 18 డ్రోన్లను పొందేందుకు త్రివిధ దళాలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -