Monday, May 6, 2024
- Advertisement -

ధ‌ర్నాచౌక్ విష‌యంలో టీ ప్ర‌భుత్వానికి షాక్‌ ఇచ్చిన హైకోర్టు ..

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వానికి , పోలీస్ శాఖ‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ఎత్తివేత నిర్ణయాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్య‌ర్వులు ఆరువారాల‌పాటు అమ‌లులో ఉంటాయాని హైకోర్టు తెలిపింది.

నగరం మధ్యలో ధర్నా చౌక్ ఉండటంతో తమకు ఇబ్బంది కలుగుతోందనీ, పిల్లలను పాఠశాలలకు పంపలేకపోతున్నామని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్ర‌భుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. నగరానికి దూరంగా ఉన్నచోట ఆందోళనలు నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో పలు ప్రజాసంఘాలు, పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి.

ప్రభుత్వం తరఫున అప్పటి అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ప్రజల భద్రత కోసమే ధర్నా చౌక్ ను ఎత్తివేశామని తెలిపారు. ధర్నా చౌక్ కారణంగా స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందనీ, ట్రాఫిక్ భారీగా స్తంభిస్తోందని వాదించారు. అయితే ఈ వాద‌న‌ల‌ను పిటిష‌ణ‌ర్లు ఖండించారు. ఇరు వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం ధ‌ర్నా చౌక్‌ను పుణ‌రుద్ద‌రిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -