ప్రజా ప్రతినిధి అయిన తర్వాత నియేజక వర్గ సమస్యలమీద కాస్తైనా దృష్టి పెట్టాలి. తమ సమస్యలు తీరుస్తాని ఓట్లేసిన ప్రజలకు చుక్కలు చూపించకూడదు. మా ఎమ్మెల్యే కనుపడుటలేదని ప్రజలు పోటీస్టేష్న్లో కేసు పెట్టారంటె అర్థం చేసుకోవచ్చు ప్రజల పరిస్తితి. బాలయ్యబాబు సినిమాషూటింగ్లతో బాగా బిజీ కదా. అందుకే తనమీద వ్యతిరేకత వస్తుండటంతో ఎట్టకేలకు తను ప్రాతి నిధ్యం వహిస్తున్నా… హిందూపురం నియోజకవర్గం మీద ఇప్పుడు ప్రేమ కలగినట్లుంది. అందుకే ఆరునెలల తర్వాత అడుగు పెట్టబోతున్నారు. ఇన్నాల్లకు నియేజక వర్గ ప్రజలు గుర్తొచ్చామని అనుకుంటున్నారు ప్రజలు.
ముందుగాలనే అనంతపురం జిల్లా కురువుప్రాంతం. ఇక నియేజకవర్గంలో నీటి సమస్య తీవ్రంగా వుండడం, ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు బాలకృష్ణకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడ్తుండడం తెల్సిన విషయమే. నిజానికి ఎమ్మెల్యే అయినప్పటినుంచీ నియోజకవర్గ ప్రజలకు బాలయ్య అందుబాటులో లేకుండా పోయారు. గతంలో స్థానిక టీడీపీ నేతలే, బాలయ్య మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నెర్రజేయడంతో ఎలాగో ఆ వివాదం సద్దుమణిగిందనుకోండి.. ఆ తర్వాత బాలయ్య పీఏగా పనిచేసిన శేఖర్ వివాదం బాలయ్యను మరింతగా వివాదాల్లోకి లాగేసింది.
సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న బాలయ్య సొంత నియోజకవర్గంపై కన్నెత్తి చూసేందుకు బాలయ్య ఆసక్తి చూపలేదు. రోజురోజుకీ నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిపోతోంది. అది తీవ్రరూపం దాల్చకముందే .. నియేజకవర్గంలో పర్యటించాలిని నాయకులు కోరడంతో మూడు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించేందుకు బాలకృష్ణ ‘ఒప్పుకున్నారట. ఇప్పటికే నియేజక వర్గంలో వ్యతిరేకత ఉన్ననేపథ్యంలో …బాలయ్య పర్యటన కోసం పోలీసలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సినమాల్లో బాలయ్య డైలాగులు చూస్తె అలాంటి వ్యక్తి రాజకీయాలల్లకి వస్తే సమస్యలు తీరుతాయని ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు.నేను ప్రజల మనిషిని..’ అని చెప్పుకునే బాలయ్య కనీసం కొంత సమయాన్నైనా ప్రజలకోసం కేటాయించాలి. పైగా సొంత నియేజక వర్గానికి వస్తుంటే ప్రజలు స్వాగతించాలిగాని భారీ బందోబస్తు ఏంటీ .. ఆయనేమన్నా తీవ్రవాదా ..అందుకే వస్తున్నా నేనొస్తున్నా మీసమస్యలను తీరుస్తాఅంటూ నియేజక వర్గంలో అడుగుపెట్టబోతున్నారు.బాలయ్యా మాజాకా….!
{youtube}J1mtvuTPg18{/youtube}
Related