ప్రస్తుతం తెలుగు టీవీ షోల్లోజబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ప్రోగ్రాం లో కామెడీ పంచులు పేల్చే వారికి బయట మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాక ఈ షోలో రాజకీయాలను వాడుకొని జోకులు పేల్చే వారిలో ప్రస్తుతం అగ్ర స్థానంలో ఉంది హైపర్ ఆది. ఆది జబర్దస్త్ ప్రోగ్రాం లోకి వచ్చిన కొత్తలో ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేదనే చెప్పాలి.
కానీ ఆది తన ప్రావీణ్యాన్ని పెంచుకుంటూ ఇప్పుడు షోలో టాప్ కమీడియన్ గా పేరు తెచ్చుకొన్నాడు. ఒక సారి ఈ ప్రోగ్రాం లో టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై వేసిన జోకు రాజకీయ వర్గాల్లో విపరీతంగా పేలింది. ఉప్పుకప్పూరంబు బీకాంలో ఫిజిక్స్ ఉండూ అని తెదేపా ఎమ్మెల్యే జలీల్ఖాన్ చేసిన వ్యాఖ్యలతో కామెడీ చేశాడు. దాంతో ఆది ఈ స్కిట్ ఏపీలో వైకాపా దాకా చేరింది.
అయితీ ఈ షోలో జడ్జిగా వ్యవహరించే రోజా వైకాపా ఎమ్మెల్యే కావడంతో హైపర్ ఆదిని రాజకీయాల్లో వాడుకుంటే టీడీపీ ఎమ్మెల్యే లపై విమర్శలు గుప్పించవచ్చని భావించిన రోజా ఆదికి వైకాపా నుండి ఎమ్మెల్యే గా ఆఫర్ ఇచ్చిందట. కానీ ఆది తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని ఆఫర్ ను తిరస్కరించాడట. వైకపా నుండి ఆదికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రోజా అనడంతో ఆది క్రేజ్ మరింత పెరిగిపోయిందని బుల్లి తెర వర్గాలు అనుకుంటున్నారు.
{youtube}P4-3yA5jEuY{/youtube}
Related