లేడిస్ హాస్టల్స్లో సీక్రెట్గా కెమెరాలు అమర్చి, వారి వీడియోస్ను రికార్డు చేస్తున్న సంఘటనలు దేశ వ్యాప్తంగా అనేకం వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా హాస్టల్ యజమానుల్లో మార్పులు రావడంలేదు. స్నాణాల గదుల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి రికార్డు చేసి వాటితో సొమ్ము చేసుకుంటున్నారు.
తమిళనాడులో, కర్ణాటకలో లేడీస్ హాస్టల్స్ లో సీక్రెట్ కెమెరా బాగోతం మరవక ముందే ముంబైలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని అప్ మార్కెట్ లో పీజీ చదువుతున్న అమ్మాయిల వీడియోలను సేకరించి, ఇతరులకు పంపించాడో దుర్మార్గుడు.
నాలుగు బెడ్ రూములున్న ప్లాట్ ను హాస్టల్ మాదిరి మార్చి, ముగ్గురిని పేయింగ్ గెస్టులుగా చేర్చుకుని, వారి గదిలో అమర్చిన అడాప్టర్ లో సీక్రెట్ కెమెరాను ఉంచాడు. వారి కదలికలను చిత్రీకరించారు. ఇది వెలుగు లోకి రావడంతో కలకలం రేగుతోంది.
ఓ అమ్మాయి అడాప్టర్ పై తన వస్త్రాన్ని కప్పగా తనిఖీ పేరుతో వచ్చిన యజమాని వస్త్రం ఎందుకు కప్పావని ప్రశ్నించడంతో అమ్మాయిలకు అనుమానం వచ్చింది. గదుల్లో రినోవేషన్ వర్క్ ఉందని తమకు చెబుతూ, కెమెరాలు అమర్చుతుండేవాడని గుర్తించిన వారు పోలీసులను ఆశ్రయించారు.
హాస్టల్ యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఏడాదిన్నరగా అమ్మాయిల ఫుటేజ్ లను యజమాని సేకరించాడని తేల్చారు. అతనిపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.