హైదరాబాద్లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. మసాజ్ స్పా సెంటర్లపేరుతో హైటెక్ పద్దతిలో అసాంఘిక కార్యకలపాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. బంజారాహిల్స్లో స్టూడియో మేకర్స్ స్పా పేరుతో సాగుతున్న వ్యభిచార దందాను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు.
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఓ అపార్ట్మెంట్లోని సెకండ్ఫ్లోర్ 205 నెంబర్ ఫ్లాట్లో స్టూడియో మేకర్స్ స్పా పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు.మసాజ్ సెంటర్ బోర్డు తగలించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది.
సెంటర్ నిర్వాహకుడు, ప్రధాన నిందితుడు సతీష్ అలియాస్ శరణప్ప అలియాస్ హరినాథ్ పరారీలో ఉండగా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ హైలైన్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న ప్లాట్ నం.205లోని స్టూడియో మేకర్స్ స్పాపై దాడి చేశారు. లోపల శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న పలువురు యువతులను, విటులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పేరుకే మసాజ్ సెంటర్ అని బోర్డు పెట్టి.. లోపల మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్పా నిర్వాహకులైన సంతోష్, హేమంత్, చైతన్య సహా పలువురిని అదుపులోకి తీసుకోగా.. ప్రధాన నిందితులు సతీష్, అలియాస్ శరణప్ప పరారీలో ఉన్నట్టు సమాచారం. స్పాలో దాడి సందర్భంగా నగదుతో పాటు, పట్టుబడ్డ యువతీ యువకుల సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.